KRNL: రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రదేశంలో మరలా ప్రమాదం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో SP విక్రాంత్ పాటిల్తో కలిసి ఆయన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. గాయత్రి ఎస్టేట్ జంక్షన్ అభివృద్ధి పనులలో పురోగతి తీసుకొనిరావాలన్నారు.