ADB: భూములు, ఇండ్లను కొనుగోలు చేసే ముందు రిజిస్ట్రేషన్కు సంబంధించిన పత్రాలను సరిచూసుకోవాలని డీఎస్పీ జీవన్ రెడ్డి గురువారం తెలియజేశారు. నకిలీ పత్రాలను సృష్టించి స్థలాన్ని కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నకిలీ డాక్యుమెంట్లతో ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.