BDK: ఆదివాసీలపై అటవీశాఖ అధికారుల దాడులను తక్షణమే ఆపాలని ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం అశ్వరావుపేట మండలం ఉరుములబండ గ్రామంలో ఆదివాసి దళిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆదివాసీలు పలు విషయాలను వెల్లడించారు. తాము గత 35 సంవత్సరాలుగా భూములను సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నట్లు వెల్లడించారు.