NDL: బేతంచెర్ల మండలంలో ఉపాధి హామీ పథకం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై సామాజిక తనిఖీలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్నాయని ఎంపీడీవో ఫజుల్ రహిమాన్ తెలిపారు. 2024-25 సంవత్సరానికి ప్రతి గ్రామానికి ప్రత్యేక బృందాలు వెళ్లి పనులు, కూలీల హాజరు, చెల్లించిన వేతనాలు, లబ్ధిదారుల వివరాలను సమగ్రంగా పరిశీలిస్తాయని చెప్పారు. పారదర్శకతే లక్ష్యమని పేర్కొన్నారు.