TG: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు యువతతో కలిసి హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులతో రంగులు పూసుకుని సందడి చేసిన ఆయన.. ఇలాంటి పండుగలు యువతలో సానుకూల చైతన్యాన్ని, సామూహిక భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ వేడుకలు విద్యార్థుల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని మరింత పెంచుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.