MBNR: గండీడ్ మండల కేంద్రంలోని రైతువేదికలో ఏవో జీ. రాధమ్మ ఆధ్వర్యంలో ఆత్మ సహకారంతో వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై అవగాహన సదస్సు జరిగింది. ఏఈవోలు సమత, వరలక్ష్మి, శివలీల, గౌతమి పాల్గొని పంటల దిగుబడి పెంపు, ఎరువుల సమతుల్య వినియోగం, వ్యాధి నియంత్రణపై సూచనలు ఇచ్చారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై సందేహాలు అడిగి నివృత్తి చేసుకున్నారు.