KNR: దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని కరీంనగర్ ప్రజావాణిలో హుజూరాబాద్ నియోజకవర్గం దళిత బంధు సాధన సమితి వినతిపత్రం అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేసిన దళితబంధు పథకం గ్రౌండింగ్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. 5,200 లబ్ధిదారుల్లో కేవలం 1,200 మందికే మంజూరు చేశారని, మిగిలిన కుటుంబాలకు రెండవ విడత నిధులు విడుదల చేయాలన్నారు.