JGL: జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవయిత్రి, రుద్రమ సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షురాలు డా. చిందం సునీత రచించిన కాలం ఒడిలో కవితా సంకలనాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యా వేత్త, రచయిత ఎంవీ నరసింహారెడ్డికి ఈ కవితా సంకలనాన్ని అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా కవయిత్రిని కళాశ్రీ అధినేత గుండేటి రాజు, పలువురు అభినందించారు.