KMM: మిర్చి క్వింటాకు రూ. 25వేలు ధర నిర్ణయించి నాఫెడ్, మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న నిర్వహిస్తున్న రైతుల మహా ధర్నా జయప్రదం చేయాలని తెలంగాణ రైతు ఖసంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబుకోరారు. ఈ మేరకు శుక్రవారం కామేపల్లి మండలంలో సంఘం ఆధ్వర్యంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. మహా ధర్నాలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.