KMM: ముదిగొండ సమీపంలో జరిగిన గ్రానైట్ రాళ్ల లారీ బోల్తా ప్రమాద ఘటన మృతులకు ఎంపీ రఘురాం రెడ్డి సంతాపం తెలిపారు. ఖమ్మం కైకొండాయిగూడెంకు చెందిన వీరన్న, హుస్సేన్ ఈ ప్రమాదంలో మరణించడం బాధాకరమని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందించాలని ఎంపీ ఆదేశించారు.