HYD: చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రధాన ఆలయ అర్చకులు రంగరాజన్ పై దాడి విషయం తెలుసుకున్న అఘోరి నాగసాధు ఆయనని శక్రవారం కలిశారు. రంగరాజన్ను పరామర్శించి అనంతరం దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దైవ సేవలో నిమగ్నమయ్యే అర్చకుడిపై దాడి చేయడం దురదృష్టకరమన్నారు. ధర్మం కోసం పోరాడే వ్యక్తిపై దాడి చెయ్యడం సరైంది కాదన్నారు.