KNR: మానకొండూరు మండలం ఊటూరులోని ఇసుక రిచ్ పాయింట్ వద్ద రవాణా, రెవిన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు గురువారం తనిఖీలు చేశారు. రీచ్ రికార్డులను పరిశీలించారు. ఇసుక యార్డుకు వాహనాలు వెళ్లే దారిని పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. అనుమతి కంటే ఎక్కువ లోడును తరలిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.