MNCL: వేమనపల్లి మండలంలోని నీల్వాయి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం పరిధి కాటేపల్లి అటవీ బీట్ పరిధిలో అక్రమంగా చెట్లు నరికిన మానేపల్లి రాజన్న, మానేపల్లి నరేష్ పై కేసు నమోదు చేసి చెన్నూరు కోర్టులో హాజరు పరిచినట్లు నీల్వాయి ఎఫ్ఆర్ఓ అప్పలకొండ తెలిపారు. అక్రమంగా చెట్లను నరికి భూమి చదును చేసినందుకు అటవీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.