PDPL: సింగరేణి నర్సరీలలో పనిచేస్తున్న కార్మికులకు జీఓ ప్రకారం వేతనాలు, సీఎంపీఎఫ్, బోనస్, వైద్యం చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్- ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న, రాష్ట్ర నాయకులు నరేష్ సింగరేణి సీఎండీ బలరాంనాయక్ను కోరారు. గురువారం గోదావరిఖనిలో సీఎండీని కలిసి వినతిపత్రం అందజేశారు.