MHBD: రైతుల కండ్లలో ఆనందం చూడడమే, రైతును రాజు చెయ్యడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూరు మండలం కర్కాల గ్రామంలో ఇటీవల సాగునీటి కొరత సమస్య ఉందని ఎమ్మెల్యే తెలుసుకున్నారు. వెంటనే స్పందించి, బయన్న వాగు రిజర్వాయర్ను రైతులతో కలిసి సందర్శించారు. అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.