అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామిని మంగళవారం సందర్భంగా వివిధ రకాల కూరగాయలతో ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. వేకువజామనే స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవ మూర్తికి పలు రకాల పుష్పాలు, తమలపాకుల తోరణాలతో అలంకరించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందజేశారు.