జైలులో ఉన్న నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు లేఖ రాశాడు. ఈ లేఖలో ఆప్ ఓటమిపై వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించాడు. కేజ్రీవాల్ను ట్రోల్ చేస్తూ.. ‘ప్రధాని కావాలనే మీ పగటి కలలన్నీ ఆపండి. మీ పార్టీ ప్రపంచంలోనే అత్యంత అవినీతి పార్టీగా మారింది. మీరు, మీ సహచరులు.. మీ బ్యాగులు సర్దుకుని శాశ్వతంగా పదవీ విరమణ చేయండి’ అని లేఖలో పేర్కొన్నాడు.