మేడ్చల్: అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో జరిగింది. పట్టణంలోని కిష్టాపూర్ రోడ్డులో ఉన్న జమున వెంచర్లాట్ నెంబరు 33లో ఆర్మూర్ శ్రీనాథ్ అనే వ్యక్తి మూడేళ్ల కిందట కృష్ణవేణి సిమెంట్ వర్క్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించారు. శ్రీనాథ్ వెనుక భాగంలో బలమైన గాయాలు ఉండటంతో సహచర కార్మికుడు రాజును పోలీసులు విచారిస్తున్నారు.