విశాఖ బీచ్ రోడ్డులోని శాంతి ఆశ్రమ స్థల వివాదంలో శనివారం రౌడీషీటర్లు దౌర్జన్యం చేయడంతో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తూర్పు నియోజకవర్గానికి చెందిన వైసీపీ కీలక నేత ఈ వ్యవహారంలో ఉన్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 23 మందిని అరెస్ట్ చేశారు. అందులో ఓ మహిళను ఉన్నారు.