PDPL: రెండు రోజుల విరామం తర్వాత జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ ప్రారంభం కాగా.. క్వింటా పత్తి ధర రూ.7,170 పలికింది. సోమవారం మార్కెట్ రైతులు 13 వాహనాల్లో 77 క్వింటాల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,170, కనిష్ఠంగా రూ.6,900 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. గత వారం కంటే తాజాగా పత్తి ధర రూ.20 పెరిగింది.