HYD: అంబర్పేట మండల పరిధిలోని అలీకేఫ్ వద్ద మూసీ నదిని మాయం చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. వందలాది లారీలతో మట్టిని తెచ్చి మూసీని చదును చేస్తున్నారు. చీకటి పడగానే కబ్జాదారులు ఈ పనులు చేస్తున్నారన్నారు. వారం రోజుల్లో సుమారు రెండు మూడు ఎకరాల మేరకు మూసీని చదును చేశారు. విషయం అధికారులకు తెలియడంతో అడిషనల్ కలెక్టర్ ముకుంద రెడ్డి మూసీ పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించి చర్యలు తీసుకున్నారు.