మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ లాంటి మైఠీహీరో చేస్తాడంటే ట్రేడంతా ఒక్కసారిగా గొల్లుమంది. ప్రభాస్కేమైనా పిచ్చి పట్టిందా అని నోటికొచ్చినట్టుగా మాట్లాడుకున్నారు. ముఖ్యంగా వైజయంతీ మూవీస్ లాంటి అగ్రనిర్మాణ సంస్థ భారీ ఎత్తున కల్కి సినిమా ప్రారంభించి ఓ పక్కన పెద్ద యుద్ధం జరుగుతుంటే మరోపక్కన ఈ చింతకాయ సినిమా ప్రభాస్ సినిమా సైన్ చేయగానే ఎవ్వడికీ అర్ధం కాలేదు. తలలు పట్టుకున్నారు.
ప్రభాస్ సినిమాలన్నిటికీ ఏదో గండం ఉన్నట్టుంది. ఏ సినిమా సక్రమంగా జరగదు. అనుకున్న టైంకి పూర్తి కాదు. కర్ణుడి ఛావుకి ఆరు కారణాలన్నట్టుగా ప్రభాస్ సినిమాకి ప్రభాసే అన్ని కారణాలూ అని చెబుతుంటారు సన్నిహితవర్గాలు. ఎందుకంటే సరైన ప్లానింగ్ ఏడవదు. ఓ పద్ధతి పాడూ ఉండవు. ఎవడెక్కువ డబ్బులిస్తే వాడికి డేట్స్…ఇలా ఉంటే అంత పెద్ద హీరో సినిమాలు అడుక్కు తినవా?
అదే దుర్భర స్థితే రాజాసాబ్ని వెంటాడుతోంది. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ లాంటి మైఠీహీరో చేస్తాడంటే ట్రేడంతా ఒక్కసారిగా గొల్లుమంది. ప్రభాస్కేమైనా పిచ్చి పట్టిందా అని నోటికొచ్చినట్టుగా మాట్లాడుకున్నారు. ముఖ్యంగా వైజయంతీ మూవీస్ లాంటి అగ్రనిర్మాణ సంస్థ భారీ ఎత్తున కల్కి సినిమా ప్రారంభించి ఓ పక్కన పెద్ద యుద్ధం జరుగుతుంటే మరోపక్కన ఈ చింతకాయ సినిమా ప్రభాస్ సినిమా సైన్ చేయగానే ఎవ్వడికీ అర్ధం కాలేదు. తలలు పట్టుకున్నారు. అది కూడా పూర్తి డేట్స్ అంటే వర్కింగ్ డేస్ అనమాట, కేవలం 29 రోజులేనని వినగానే మరీ అప్సెట్ అయిపోయారు.
ఇప్పుడా 29 రోజులు కాస్త కోతి పుండు బ్రహ్మరాక్షసి అన్నట్టుగా తయారైంది. ఈ ప్రాజెక్టు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వప్రసాద్ చేతిలోకి వెళ్ళక ముందు చాలా చేతులు మారింది. బడా నిర్మాత ఒకరు వద్దు బాబోయ్ నావల్లకాదని చేతులెత్తేశాడు. ఆయన్ని బ్రతిమాలారని కూడా వినిపించింది. దీనికి కారణం ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ పెట్టుబడులు ఏవో ఉన్నాయని, ఆదిపురుష్ దెబ్బ తినగానే, ఆ నష్టం పూడ్చుకోవడానికి మారుతీ కథ ఒకటుంది అది ఎలాగైనా స్టార్ట్ చేయాలనే విశ్వప్రయత్నం జరిగింది
ప్రభాస్తో చేస్తే వరస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న తన బ్యానర్కి కొంచెం హై వస్తుందని ఆశ పడ్డ టిజి విశ్వప్రసాద్ రాత్రికి రాత్రి 50 కోట్లు సర్దుబాటు చేశారని, ఆ ఆబ్లిగేషన్తో ప్రభాస్ కళ్ళు మూసుకుని సంతకం పెట్టేశాడని పరిశ్రమలో ఓ పెద్ద వ్యక్తే కామెంట్ చేశాడు. పెద్ద మొత్తమే ముట్టచెప్పడం వరకూ బాగానే ఉంది. అదేమంత గొప్పది కూడా కాదు, ప్రభాస్ రేంజ్కి. కానీ, ఇతర సినిమాల ఉక్కుచట్రంలో చిక్కుకున్న ప్రభాస్ మారుతి సినిమా ఒక్కటే కొంచెం ఈజీగా, కేక్వాక్లా అనిపించింది. అనిపించడం వరకూ ఒకే. కానీ తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి.
సినిమా ఎలా ఉందో, ఆ కథ ఏమిటొ ఎవడికీ తెలియదు గానీ, తెలిసిందల్లా గ్రాఫిక్స్ విషయంలో జరుగుతున్న గందరగోళం. కోటాను కోట్ల గోల్మాల్. దాదాపు 40 కోట్లు ఖర్చు పెట్టి, నెలల తరబడి చేసిన సిజి వర్క్ పూర్తిగా ఆసాంతం భ్రష్టు పట్టిపోయింది. మళ్ళీ మొదటికొచ్చింది యవ్వారం. బాగా డబ్బున్నోడు కాబట్టి విశ్వప్రసాద్ తట్టుకున్నాడు గానీ, మరొకడు ఎవడైనా సరే కొంప కొల్లేరై ఉండేది. స్వయంగా ప్రభాసే సిజి వర్క్ అంతా పర్యవేక్షణ చేసి మరీ అన్నీ చెత్తబుట్టలో పడేశాడని ఆ టీమ్లోని వారే చెబుతున్నారు.
ఈలోగా ఏమైందీ…….ఫౌజీ డేట్స్ కాస్త ముంచుకొచ్చాయి. గత్యంతరం లేదు ప్రభాస్కి. పైగా దానికి స్పెషల్ గెటప్ గొడవొకటి ఉంది. దాంతో ప్రభాస్ లేచి గెంతేసి ఫౌజీ షూటింగ్లోకి దూరిపోయాడు. ఇంకా దాదాపు 50 రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది రాజాసాబ్కి. ప్రభాస్ ఎప్పుడివ్వగలుగుతాడు? ఎప్పుడు ఈ వర్క్ అంతా మారుతీ ఎప్పుడు పూర్తి చేస్తాడు. ఎప్పుడు రాజాసాబ్ ధియేటర్స్ని చేరుకుంటుంది? బ్రమ్మదేవుడిని అడిగినా సమాధానం చెప్పగలిగే పరిస్థితి లేదు. స్వయంగా నిర్మాత విశ్వప్రసాదే చెప్పలేకపోతున్నారట. ఏం చెప్పగలరు? పాపం.