SKLM: రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డిని బుధవారం శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ నేతలు ఆంధ్ర రత్న భవన్ వద్ద కలసి సంఘీభావం తెలిపారు. ఆమెకి ఇటీవల ప్రభుత్వం గృహ నిర్బంధం విధించినందుకు తమ సంఘీభావం తెలియజేసేందుకు వచ్చినట్లు శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు నర్సింగ్పేట నియోజకవర్గ ఇంఛార్జ్ మామిడి సత్యనారాయణ తెలిపారు.