NLR: కొడవలూరు మండల వ్యాప్తంగా శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీవో వెంకట సుబ్బారావు తెలిపారు. మండలంలోని 16సచివాలయాల పరిధిలోని 6,430మంది లబ్ధిదారులకు రూ 2,74,61,000 పంపిణీ చేస్తామన్నారు. సచివాలయ సిబ్బంది 31న ఉదయం 7గంటల నుంచి నగదు పంపిణీ ప్రారంభిస్తారని చెప్పారు. లబ్ధిదారులు ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలన్నారు.