KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో వరి ధాన్యం, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, వానాకాలం పంట సన్నద్ధతపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో చర్చించారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు