AP: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా రహదారులను విస్తరించనున్నామని MLA బుడ్డా రాజశేఖరరెడ్డి తెలిపారు. సుండిపెంటలో రూ.8 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. రోడ్ల విస్తరణలో నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సున్నిపెంటలో రోడ్ల విస్తరణ మార్చి 15 లోపు పూర్తి చేస్తామన్నారు.