PDPL: ధర్మారం మండలం నర్సింగాపూర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో నిరంతరాయంగా, 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయని మేనేజర్ శ్యాం కుమార్ శుక్రవారం తెలిపారు. నగదు ఉపసంహరణ, బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్మెంట్ మొదలైన సేవలను వినియోగదారులు సెలవు దినాలలో కూడా పొందవచ్చని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే బ్యాంకు శాఖలో సంప్రదించాలని ఆయన సూచించారు.