HYD: ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.10 లక్షలు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. బంజారాహిల్కు చెందిన ఓ వైద్యురాలు ఆన్లైన్ ట్రేడింగ్ ప్రకటన చూశారు. అనంతరం వాట్సాప్లలో సైబర్ నేరగాళ్లు ఆమెను సంప్రదించారు. మొదటగా రూ.10,000 పెట్టిన బాధితురాలు లాభాలు రావడంతో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టింది. దీంతో నేరగాళ్లు అదును చూసి జండా ఎత్తేశారు.