BDK: మణుగూరు మండలం రామానుజవర గ్రామ సమీపంలో ప్రధాన రహదారి గుంతలతో ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా తక్షణం స్పందించి 50 లక్షల వ్యయంతో మరమ్మత్తులు పనులను చేపట్టారు. ఈ పనులను సోమవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యక్షంగా పరిశీలించారు. పనులు నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.