WGL: క్రిస్మస్ సందర్భంగా తన నివాసంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేశారు. ఏసుప్రభు దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు భాస్కర్, సెక్రెటరీ ప్రకాశ్, భూషణ్, రాజు, తదితరులు ఉన్నారు.