MDK: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందారు. రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ వద్ద గత రాత్రి బైక్ రోడ్డు కిందికి దూసుకుపోయి టీ మాందాపూర్ గ్రామానికి చెందిన అంగడి శ్రీకాంత్ అనే వ్యక్తి నీటిలో మునిగి తీవ్ర గాయాలపాలయ్యారు. ఆసుపత్రికి తరలించే లోపు మృతిచెందారు. బంధువుల శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు బంధువులు తెలిపారు.