KMM: మధిర పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం బుధవారం మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో ముమ్మరంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు చర్చిలలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలలో పాల్గొని స్థానిక ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.