WNP: ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పేదలకు క్రీ.శే. రాజరత్నం జ్ఞాపకార్థం కుమారుడు విజయ్ 50 మందికి దుస్తులను పంపిణీ చేపట్టారు. తన తండ్రి జ్ఞాపకంగా యేటా పేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.