KMM: మల్లెమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న అనిత అనే విద్యార్థిని సీఎం కప్ పోటీల్లో భాగంగా ఇటీవల జరిగిన పుట్ బాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా అనితను అభినందిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ప్రకటన విడుదల చేశారు. అనిత రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవ్వడం సంతోషకరమన్నారు.