HYD: రాజేంద్రనగర్ ప్రాంతంలో నూతనంగా నిర్మించనున్న హైకోర్టు భవన నిర్మాణానికి R&B శాఖ మరో రెండు వారాల్లో టెండర్లను పిలువనుంది. బిల్డింగ్ డిజైన్ ఫైనల్ చేసేందుకు నేడో, రేపో హైకోర్టు భవన నిర్మాణ కమిటీతో అధికారులు, బిల్డింగ్ డిజైన్ సంస్థ భేటీ కానుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ భవన నిర్మాణం కోసం రూ.2,583 కోట్ల నిధులను కేటాయించింది.