NLG: జిల్లాలో బీజేపీని బలోపేతం చేసేందుకు అధిష్టానం దృష్టి సారించింది. జనవరిలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి నల్గొండ జిల్లాకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి.