W.G: భీమవరం ముస్లిం కమిటీ ప్రెసిడెంట్ ఎస్.కే రబ్బానీ కుటుంబ సభ్యులను సోమవారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పరామర్శించారు. రబ్బానీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాగపు ప్రసాద్, సయ్యద్ ఖాజా, బాషా, ఖలీల్, శబూ రబ్బానీ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.