JGL: దేశ ప్రజలకు కేంద్ర మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని ధర్మపురి MLA లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం TPCC పిలుపు మేరకు పట్టణంలోని గాంధీభవన్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో MLC జీవన్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించి అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు.