KMM: ఆడబిడ్డలకు ప్రభుత్వం కొండంత అండగా ఉంటుందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. కామేపల్లిలో మంగళవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తహసీల్దార్ సుధాకర్, డీసీసీబీ డైరెక్టర్ ఎం.మల్లిబాబు యాదవ్, ఎంపీడీవో రవీందర్, ఏవో తారాదేవి, జి.నరసింహారెడ్డి, డి.హనుమంతరావు, బావ్ సింగ్, గబ్రు పాల్గొన్నారు.