ప్రకాశం: గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో దిగువ మెట్ట నుంచి నంద్యాల వైపు వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.