TPT: చంద్రగ్రహణం సందర్భంగా వడమాలపేట మండలం అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయం మూసి వేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 5:45 గంటలకు స్వామివారి సుప్రభాత సేవ జరుగుతుంది. ఉదయం 6:15–6:45 విశ్వరూప దర్శనం, 8–8:45 సర్వదర్శనం. 9 నుంచి రాత్రి 8 వరకు ఆలయం మూసివేత. అనంతరం శుద్ధి, ఏకాంత సేవ జరగనుంది.