TG: గాంధీవిగ్రహం పేరుతో పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గమని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. బఫర్ జోన్, FTL పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తే.. పెద్దల ఇళ్లను బుల్డోజర్లతో కూలుస్తామన్నారు. ఒవైసీ కాలేజీ కూల్చడానికి పరీక్షల సాకు చెప్పారన్నారు. మరి ఖమ్మంలో ఇంటర్ విద్యార్థుల భవిష్యత్ గుర్తురాలేదా? అని ప్రశ్నించారు. ఒవైసీ కళ్లలో ఆనందం కోసం హిందువులను జైల్లో వేస్తారా? అని దుయ్యబట్టారు.