ADB: ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన బేల మండలంలో చోటుచేసుకుంది. సోమవారం మండలంలోని వరూర్ గ్రామంలో తన వ్యవసాయ భూమిలో వెంకట్ రావు(60) మృతిచెంది కనిపించినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు పోలీసుకు తెలపడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలియజేశారు.