ASR: అరకులోయ మండలంలోని పద్మాపురం పంచాయతీ పింపలుగుడ గ్రామంలో ఈనెల 22న మమత చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు జన్ని గోపాల్, ఎం.లచ్చు, కిల్లో మహేష్ చెప్పారు. ఈ మెగా వైద్య శిబిరానికి అరకులోయ సబ్ ఇన్స్పెక్టర్, స్థానిక సర్పంచ్, ఆహ్వాన పత్రం ఇచ్చామన్నారు. ఆయా గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.