KMR: జుక్కల్ మండలం మథుర తాండ మాజీ సర్పంచ్ సంజు మరో 30 మంది కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో ఆదివారం చేరారు. షిండే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని, అందుకే ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డోన్గాం సర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.