కృష్ణా: వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామ శివారుతోట మూల మూలమలుపు వద్ద ఆదివారం అర్ధరాత్రి అదుపుతప్పి ప్రమాదవశాత్తు ఓ లారీ బోల్తా కొట్టింది. స్థానికుల వివరాల మేరకు.. మూలమలుపు కావడంతో డ్రైవర్కు రూట్ తెలియకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో లారీ డ్రైవర్ బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.