VKB: దుద్యాల మండల కేంద్రం నుంచి సాగారంతండా వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన అధికారులు అసంపూర్తిగా పనులు వదిలివేయడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. కంకర పరిచి వదిలివేయడంతో దుమ్మూధూళి కళ్లల్లో పడి ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. దీంతో అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు.