KNL: గొల్లపల్లి మండల వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ దాదాపు పూర్తయింది. 95 శాతం కొనుగోళ్లు చేపట్టినట్లు స్థానిక అధికారులు తెలిపారు. పలువురు రైతులు నారు మడులను సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే 20 రోజుల్లో వరి నాట్లు ప్రారంభం కానున్నాయి. మండల వ్యాప్తంగా వచ్చే సీజన్ లోనూ మళ్లీ వరిని ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు.