KNR: శంకరపట్నం మండలంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి హైస్కూల్ వరకు రహదారి విస్తరణ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్, ఉపసర్పంచ్ ఆకు బత్తిని విజయకుమార్ ఆధ్వర్యంలో యజమానుల అనుమతితో రోడ్డుకు అడ్డంగా ఉన్న పాత ఇళ్ల గోడలను తొలగిస్తున్నారు. ఈ పనుల వల్ల రాకపోకలు సులభతరం అవుతాయని స్థానికులు తెలిపారు.