ప్రకాశం: మార్కాపురం జిల్లా ప్లినం సమావేశం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, ప్రతినిధుల సమక్షంలో సీపీఎం జిల్లా కార్యదర్శిగా డి. సోమయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. కొత్త బాధ్యతలు స్వీకరించిన సోమయ్యకు పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు.